News

ముఖ్యమంత్రికి విజయసాయిరెడ్డి సవాల్


రాజ్యసభ సభ్యుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎపి కి ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ బెటర్ అని వాదిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు వస్తారా అని సవాల్ చేశారు.విభజన చట్టంలోని అంశాలనే, ఈ ఐదేళ్లు రాష్ట్రానికి రావాల్సిన నిదులనే చెబుతూ వెంకయ్య నాయుడు, చంద్రబాబులు ప్యాకేజీగా ప్రచారం చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై నిజంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఉత్తర్వులు జారీ చేశారా అని ప్రశ్నించారు. సొంత ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు.